IIIT Hyderabad: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు పర్యావరణ అవార్డు
Sakshi Education
పర్యావరణ కాలుష్య నివారణ సదస్సులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ అవార్డును గెలుచుకుంది.
IIIT Hyderabad win Environment Award
భవన నిర్మాణం చేస్తున్నప్పుడు ఏర్పడే కాలుష్యంపై ట్రిపుల్ఐటీ బృందం అధ్యయనం చేసి సమర్పించిన పేపర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్సేన్లో ఇటీవల ‘పర్యావరణ కాలుష్యం–నివారణ’పై జరిగిన 11వ అంతర్జాతీయ సదస్సు–2023లో ‘కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్స్’ అనే అంశంపై రూపొందించిన పరిశోధనా పత్రాన్ని ట్రిపుల్ ఐటీ బృందం ప్రదర్శించింది. దీన్ని పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు.