Skip to main content

Ticket Inspector: టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి రూ.కోటి వ‌సూలు చేసిన మహిళా టీసీ

టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసి దక్షిణ రైల్వే చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రోజలీన్‌ అరోకియా మేరీ రికార్డు సృష్టించారు.
Rosaline Arokia Mary
Rosaline Arokia Mary

ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. రైలులో ప్రయాణికుల టికెట్లు చెక్‌ చేస్తూ, జరిమానాలు వసూలు చేస్తున్న మేరీ ఫొటోను రైల్వే శాఖ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. విధుల పట్ల ఆమె అంకితభావాన్ని కొనియాడింది. ఈ పోస్ట్‌ వెంటనే వైరలయింది. నెటిజన్లు ఆమె నిబద్ధతపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్‌ మరింత శక్తివంతంగా ఎదగాలంటే ఇలాంటి అంకితభావం కలిగిన మహిళలు అవసరం. రోజలీన్‌కు అభినందనలు’ అంటూ ఆమెను పొగిడారు.

TC Rosaline Arokia Mary

 

Published date : 24 Mar 2023 05:01PM

Photo Stories