Skip to main content

Celebrity Brand Valuation: భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచిన వ్యక్తి?

Virat

Celebrity Brand Valuation Report 2021: 2021 ఏడాదికి సంబంధించి భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నిలిచాడు. అంతకుముందు ఏడాది 2020తో పోలిస్తే కోహ్లీ సంపద తగ్గినా సెలబ్రిటీలందరితో పోలిస్తే బ్రాండ్‌ విలువ పరంగా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 2020లో కోహ్లీ బ్రాండ్‌ వాల్యూ 23.77 కోట్ల డాలర్లుండగా, 2021లో 18.57 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,400 కోట్లు) పరిమితమైంది. కన్సల్టెన్సీ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితా ప్రకారం... కోహ్లీ తర్వాత స్థానాన్ని 15.83 కోట్ల డాలర్లతో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఆక్రమించారు. రణ్‌వీర్‌ తర్వాత 13.96 కోట్ల డాలర్లతో హిందీ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. ఒలింపిక్‌ విజేత పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు.

Comptroller and Auditor General of India: కల్యాణ్‌ జువెల్లర్స్‌ చైర్మన్‌గా నియమితులైన మాజీ కాగ్‌?

సెలబ్రిటీ

ర్యాంక్

బ్రాండ్‌ విలువ(కోట్ల డాలర్లలో..)

విరాట్‌ కోహ్లీ

1

18.57

రణ్‌వీర్‌ సింగ్‌

2

15.83

అక్షయ్‌ కుమార్‌

3

13.96

ఆలియా భట్

4

6.81

ఎంఎస్‌ ధోనీ

5

6.12

అమితాబ్

6

5.42

దీపికా పదుకోన్

7

5.16

సల్మాన్‌ ఖాన్‌

8

5.16

ఆయుష్మాన్‌ ఖురానా

9

4.93

హృతిక్‌ రోషన్‌

10

4.85

 

​​​​​​​Chief Minister of Goa: గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాదిలో అత్యంత విలువైన సెలబ్రిటీగా భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నిలిచాడు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు    : కన్సల్టెన్సీ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌
ఎక్కడ    : భారత్‌

Published date : 31 Mar 2022 06:45PM

Photo Stories