Parliament: ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
![Parliament](/sites/default/files/images/2023/03/17/parliament-650x400-1679049932.jpg)
2021 ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ పన్నెండు మందిని శీతాకాల సమావేశాలు మొత్తానికి (నవంబరు 29– డిసెంబరు 23 వరకు) సభ నుంచి సస్పెండ్ చేయాలని నవంబర్ 29న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాజ్యసభ దీన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది.
సస్పెన్షన్కు గురైన ఎంపీలు..
ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్), డోలా సేన్, శాంతా చెత్రి (తృణమూల్ కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్ (శివసేన), ఎలమారమ్ కరీమ్ (సీపీఎం), బినయ్ విశ్వం (సీపీఐ).
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
మూడు వివాదాస్పద సాగు చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘కు పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. నవంబర్ 29న లోక్సభ, రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే.. నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి.
బీఎఫ్ఐఎల్ ఏ సంస్థలో భాగం?
ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (బీఎఫ్ఐఎల్) ఎండీ, సీఈవో శలభ్ సక్సేనా తన పదవికి రాజీనామా చేశారు. సక్సేనాతోపాటు ఈడీ, సీఎఫ్వో ఆశీష్ దమానీ కూడా నవంబర్ 25న తన పదవికి రాజీనామా చేసినట్లు బీఎఫ్ఐఎల్ తెలిపింది.
చదవండి: భారత నావికాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా...
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్