Skip to main content

Supreme Court Collegium: తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఎంపికైన వ్యక్తి?

వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది.

 ఆగస్టు 25, సెప్టెంబర్‌1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్‌కు చెందినవారు కాగా, 31మంది జుడిషియల్‌ సర్వీసెస్‌కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్‌ చేసింది. వీరిలో 44మంది బార్‌కు, 24 మంది జుడిషియల్‌ సర్వీసెస్‌కు చెందినవారు ఉన్నారు.

పది మంది మహిళలు...
ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది. తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్‌టీ జుడిషియల్‌ అధికారి మర్లి వాంకుంగ్‌ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్‌ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్‌ అండ్‌ హర్యానా, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు.

సుప్రీం జడ్జిల సంఖ్య 33...
ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్‌ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది.
 

Published date : 04 Sep 2021 06:23PM

Photo Stories