Skip to main content

7th Indian Water Week: జల సంరక్షణపై శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి సూచనలు

దేశంలోని నీటి వనరుల పరిరక్షణకు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశ జల భద్రతలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుందని ఆమె అన్నారు.
President Droupadi Murmu inaugurates 7th India Water Week
President Droupadi Murmu inaugurates 7th India Water Week

ఏడో విడత ‘ఇండియా వాటర్‌ వీక్‌’ను పురస్కరించుకుని శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పట్టణ ప్రణాళిక అధికారులతో నవంబర్ 1న జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘దేశ జనాభా పెరుగుతోంది. జలాశయాలు, నదుల్లో నీటి లభ్యత తగ్గుతోంది. గ్రామాల్లో చెరువులు ఎండిపోతున్నాయి. స్థానిక నదులు కనుమరుగవుతున్నాయి. జల భద్రత ఆందోళనకరంగా మారింది’ అన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో శుద్ధమైన నీటిని ప్రజలకు అందించడం సవాలుగా మారిందని ముర్ము చెప్పారు. ‘దేశంలోని జలవనరుల్లో 80% వరకు వ్యవసాయ అవసరాలకే వాడుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో నీటి సది్వనియోగం, సాగు నీటి నిర్వహణ చాలా కీలకం’అని రాష్ట్రపతి చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు నీటిని పొదుపుగా వాడుకోవడం నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని కోరారు.

Also read: Supreme Court: స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Nov 2022 03:36PM

Photo Stories