Skip to main content

Himanchal Pradesh Assembly : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పించన్‌ బంద్‌..

Himachal pradesh government had approved new bill for mla pension

ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో­కి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పించన్‌ ఇవ్వొద్దని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు­కు గురైన ఎమ్మెల్యేలు అందరికీ ఇది వర్తిస్తుంది. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్ల్లో ఈ ఆరుగురిలో ఇద్దరు మళ్లీ గెలవగా, నలుగురు ఓడిపోయారు. వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పింఛన్లు రాకుండా ఈ బిల్లును తీసుకొచ్చింది.

Asia Pacific Ministerial Conference: ఢిల్లీలో రెండో ఆసియా–పసిఫిక్‌ మినిస్టీరియల్‌ సదస్సు.. ప్రపంచ విమానయాన హబ్‌గా భారత్

Published date : 14 Sep 2024 03:06PM

Photo Stories