Skip to main content

Border Infrastructure and Management: బీఐఎం పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?

Indo-Pak Border

2021–22 నుంచి 2025–26 వరకు (15వ ఫైనాన్స్‌ కమిషన్‌ పదవీ కాలం) బోర్డర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్‌మెంట్‌(బీఐఎం) పథకాన్ని రూ.13,020 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, నిఘాను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఫిబ్రవరి 21న ప్రభుత్వం ఒక ప్రకటనను వెలువరించింది. బీఐఎం పథకం కింద.. సరిహద్దుల్లో ఫెన్సింగ్, లైట్లు, రోడ్లు, ఔట్‌పోస్టులు, కంపెనీ ఆపరేటింగ్‌ బేసులను అభివృద్ధి చేస్తారు.

భారత్‌తో అత్యధిక భూసరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది?

భారత్‌కు పాకిస్తాన్‌తో 3,310 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌తో 4,096, చైనాతో 3,488, నేపాల్‌తో రూ.1,752, భూటాన్‌తో 578, మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చైనా, నేపాల్, భూటాన్‌ సరిహద్దుల్లో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్‌ సరిహద్దుల్లో ఫెన్సింగ్, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా సరిహద్దుల వెంట హైటెక్‌ ఎలక్ట్రానిక్‌ నిఘా పరికరాలను బిగిస్తోంది.

చ‌ద‌వండి: దేశంలోని ఎన్ని ప్రాంతాల్లో కిసాన్‌ డ్రోన్‌లను ప్రారంభించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 నుంచి 2025–26 వరకు (15వ ఫైనాన్స్‌ కమిషన్‌ పదవీ కాలం) బోర్డర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్‌మెంట్‌(బీఐఎం) పథకాన్ని రూ.13,020 కోట్లతో కొనసాగించడానికి ఆమోదం
ఎప్పుడు  : ఫిబ్రవరి 21
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బీఐఎం పథకం కింద.. సరిహద్దుల్లో ఫెన్సింగ్, లైట్లు, రోడ్లు, ఔట్‌పోస్టులు, కంపెనీ ఆపరేటింగ్‌ బేసులను అభివృద్ధి చేసేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Feb 2022 12:00PM

Photo Stories