Skip to main content

Aero India: దేశీయ ఆయుధాలకే ప్రాధాన్యం.. రాజ్‌నాథ్‌

దేశీయంగా ఉత్పత్తి చేసిన ఆయుధాలు, పరికరాలకే రక్షణ రంగంలో ప్రాధాన్యమిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.
Defence minister Rajnath Singh

2023–24లో రక్షణ శాఖ పెట్టుబడి వ్యయంలో 75 శాతం నిధులను వాటి కొనుగోలుకే వెచ్చించనున్నట్లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ వర్గాలు ఒక్క అడుగు ముందుకేస్తే ప్రభుత్వం 10 అడుగులు వేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

Published date : 16 Feb 2023 01:43PM

Photo Stories