Skip to main content

India-Pakistan: అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐ?

CJI in Punjab

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఏప్రిల్‌ 14న పంజాబ్‌లో పర్యటన కొనసాగించారు. రాష్ట్రంలోని అట్టారీ–వాఘా సరిహద్దును, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) మ్యూజియంను సందర్శించారు. భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు అయిన జీరో పాయింట్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను సీజేఐ దంపతులు తిలకించారు. అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ రికార్డుకెక్కారు. అలాగే బైశాఖీ పర్వదినం సందర్భంగా పంజాబ్‌ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Pradhanmantri Sangrahalaya: ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు?

సీజేఐ దంపతులు ఏప్రిల్‌ 13న పంజాబ్‌ పర్యటన ప్రారంభించారు. తొలుత అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Union Cabinet: రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ ప్రధాన ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)?
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు    : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ఎక్కడ    : భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు
ఎందుకు : పంజాబ్‌లో రాష్ట్ర పర్యటనలో భాగంగా..

Published date : 15 Apr 2022 03:18PM

Photo Stories