Skip to main content

Union Cabinet: రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ ప్రధాన ఉద్దేశం?

Panchayat Raj

పంచాయతీరాజ్‌ సంస్థల్లోని ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)కు రూ.5,911 కోట్లు అందనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏప్రిల్‌ 13న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. పథకం రూపురేఖలు మార్చి 2026 మార్చి 31 దాకా కొనసాగించాలని నిర్ణయించింది. గ్రామాల్లో సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన, ఆరోగ్య కల్పన, బాలలకు సౌకర్యాలు, సుపరిపాలన తదితర లక్ష్యాలను సాధించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలను కల్పించాలని నిర్ణయించారు.

New Covid Variant XE: దేశంలో తొలి ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసు ఎక్కడ నమోదైంది?

Union Territory: చండీగఢ్‌ను తమకు బదలాయించాలని తీర్మానం చేసిన రాష్ట్రం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)కు రూ.5,911 కోట్లు కేటాయించాలని నిర్ణయం
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు    : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 
ఎందుకు : పంచాయతీరాజ్‌ సంస్థల్లోని ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Apr 2022 11:54AM

Photo Stories