IIT Madras : ఐఐటీ–మద్రాసులో జల విజ్ఞాన కేంద్రం
Sakshi Education

ఐఐటీ మద్రాసులో సరికొత్త జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. శుభ్రమైన తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన సంయుక్త ఒప్పందమిది. ముఖ్యంగా పట్టణాల్లో నీటి సరఫరాకు సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి ఈ కేంద్రం కృషి చేస్తుంది.
జల విజ్ఞానంలో నూతన పరిశోధనలు, నవీకరణలు సాధిస్తుంది. ఇందుకు, ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా అనే అంశంపై ఐఐటీ-మద్రాసులో స్వల్పకాలిక కోర్సు నిర్వహించారు. అనంతరం, త్రైపాక్షిక ఒప్పందంపై పలువురు అధికారులు సంతకాలు చేశారు.
Published date : 21 Aug 2024 10:31AM