Skip to main content

US President Joe Biden: బైడెన్‌ కార్యవర్గంలో 130 మందికిపైగా భారత సంతతి వ్యక్తులు

us president joe biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో 130 మందికిపైగా భారతీయులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఆ దేశంలో సుమారు ఒక శాతం ఉన్న ఇండోఅమెరికన్లకు ఈ స్థాయిలో అధ్యక్షుడి కార్యవర్గంలో ప్రాతినిధ్యం లభించడం విశేషం. గతంలో ట్రంప్‌ కార్యవర్గంలో 80 మందికి స్థానం లభించింది. అంతకు ముందు ఒబామా కార్యవర్గంలో ఎనిమిదేళ్ల కాలంలో 60 మంది ఇండోఅమెరికన్లు కొలువుదీరారు. ఈ విషయాన్ని 'ఇండియాస్‌ పొర సంస్థ' నిర్ధారించింది. బైడెన్‌ ప్రసంగాల రచయిత వివేక్‌రెడ్డి, కొవిడ్‌ 19 విషయంలో సలహాదారు డాక్టర్‌ ఆశీష్‌ ఝా, పర్యావరణ విధానం సలహదారు సోనియా అగర్వాల్, క్రిమినల్‌ జస్టిస్‌పై ప్రత్యేక సలహాదారు చిరాగ్‌ బయా¯Œ ్స, పర్సనల్‌æమేనేజ్‌మెంట్‌ హెడ్‌ కిరణ్‌ అహూజ, సీనియర్‌అడ్వైజర్‌ నీరా టండన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Sep 2022 04:56PM

Photo Stories