Skip to main content

Indo-Pacific Strategy: ఏ దేశం నుంచి భారత్‌కు పెను సవాళ్లున్నాయని అమెరికా వెల్లడించింది?

Flag of India

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 11న తొలి నివేదికను విడుదల చేసింది. భారత్‌కు ప్రధానంగా డ్రాగన్‌ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని ఈ నివేదికలో వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని తెలిపింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. 
  • ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్‌ పరస్పరం సహకరించుకోవాలి. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. 
  • ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో భారత్‌ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తాము.
  • దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న.

చ‌ద‌వండి: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Feb 2022 01:31PM

Photo Stories