Skip to main content

India-Britain: ప్రధాని మోదీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ ఎక్కడ సమావేశమయ్యారు?

PM Modi - Boris Johnson

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఏప్రిల్‌ 22న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత, అఫ్గాన్‌లో శాంతి స్థాపన, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

Gujarat: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్‌ ప్రధాని?

మోదీ, బోరిస్‌ భేటీ–ముఖ్యాంశాలు

  • రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకారం.
  • వచ్చే దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయం.
  • భూ, జల, వాయు, సైబర్‌ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయం.
  • విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి.

మరికొన్ని అంశాలు..

  • 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
  • ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు.  
  • ఇండియాకు ఒజీఈఎల్‌ (ఓపెన్‌ జనరల్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్‌ చెప్పారు. అలాగే నూతన ఫైటర్‌ జెట్‌ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు.
  • ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని మోదీ స్వాగతించారు.

ఆర్థిక నేరాగాళ్ల అప్పగింత..
తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్‌ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు.

టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు..
బ్రిటన్‌లో ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్‌ ఆందోళనను బోరిస్‌ జాన్సన్‌ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

GK National Quiz: సుజలాం 2.0 ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 22
ఎవరు    : బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌
ఎక్కడ    : న్యూ ఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత, అఫ్గాన్‌లో శాంతి స్థాపన, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Apr 2022 03:59PM

Photo Stories