Skip to main content

Teachers Day 2022 Awards: ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ గుర్తింపు

- తెలంగాణ నుంచి ముగ్గురికి, ఏపీ నుంచి ఒకరికి పురస్కారాలు అందించిన రాష్ట్రపతి ముర్ము
President to honour 46 teachers with National Awards
President to honour 46 teachers with National Awards

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పురస్కారాలు అందుకున్నవారిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒకరు ఉన్నారు. 

Also read: Central Rural Development Department: ముఖరా(కె).. అవార్డులన్నీ ఆ ఊరికే..

తెలంగాణ నుంచి మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబ్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన టి.ఎన్‌ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన కందాళ రామయ్య, హైదరాబాద్‌ నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సునీతరావు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ నుంచి విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డాక్టర్‌ రావి అరుణకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కా రాన్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 5th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Sep 2022 04:43PM

Photo Stories