Skip to main content

ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

ఎర్రవల్లిచౌరస్తా: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ముసాయిదా బేగం అన్నారు.
Every student should set a goal
Every student should set a goal

మంగళవారం ఇటిక్యాల మండల పరిదిలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారి చదువు, సమస్యలౖపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని నోట్‌ చేసుకొని చదివే క్రమంలో వారికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ లీగల్‌ అధికారి శివ.. విద్యార్థులకు బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, 1098, 100 హెల్ప్‌లైన్‌ నెంబర్లపై అవగాహణ కల్పించారు. హింసకు గురవుతున్న మహిళలు 181కు ఫోన్‌ చేసి సహాయాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మదునాయుడు, అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ సంధ్య, ఉపాధ్యాయులు, అంగన్‌వాడి టీచర్లు, తదితరులు ఉన్నారు.

Published date : 09 Aug 2023 04:06PM

Photo Stories