విద్యార్థులకు మైక్రోసాఫ్ట్తో అప్స్కిల్లింగ్ కార్యక్రమం
Sakshi Education
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో 1.62 లక్షల మంది విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.