Skip to main content

Tamilisai Soundararajan: విద్యార్థులను నిరంతరం గమనించాలి: గవర్నర్‌

టీచర్లు పిల్లల్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని, పిల్లల ఆరోగ్యంలో ఎలాంటి చిన్న సమస్య కనిపించినా వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు.
Tamilisai Soundararajan
విద్యార్థులను నిరంతరం గమనించాలి: గవర్నర్‌

పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్‌ 1న గవర్నర్‌ రాజ్‌భవన్ స్కూల్‌ను సందర్శించారు. క్లాస్‌ రూంలు తిరిగి, పాఠశాల నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలపై ఆరాతీశారు. చాలాకాలం తర్వాత పాఠశాలకు రావడం ఎలా ఉందని పిల్లల్ని గవర్నర్‌ ప్రశ్నించగా, ఎంతో సంతోషంగా ఉందని వారు జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారు పాఠశాలకు అందించిన మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులతో పాటు పాఠశాలలో చదువుతున్న ప్రతీ విద్యార్థిని జూనియర్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులుగా గుర్తించి వారికి ఐడీ కార్డులు ఇచ్చారు. గవర్నర్‌ మాట్లాడుతూ, నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలు అభినందనీయమన్నారు. గవర్నర్‌గా, ఒక డాక్టర్‌గా, ఒక పేరెంట్‌గా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులు, నాన్టీచింగ్‌ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు.

Published date : 02 Sep 2021 06:06PM

Photo Stories