Skip to main content

Scholarship: సెప్టెంబ‌ర్ 25 నుంచి ఉపకార దరఖాస్తు

Scholarship
Scholarship

పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబ‌ర్ 25 నుంచి ప్రారంభం కానుంది. 2021–22 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజేబుల్, ఈబీసీ ఫ్రెషర్స్, రెన్యువల్‌ విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాలేజీ యాజమాన్యాలు కూడా ఈపాస్‌ వెబ్‌సైట్‌లో అనుబంధ గుర్తింపు పత్రాలతో రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపింది. నిర్దేశించిన గడువులోగా పూర్తిస్థాయి విద్యార్థులు దరఖాస్తులు సమరి్పంచేలా చైతన్య పర్చాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా స్పష్టంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఉత్తర్వులు జారీచేశారు. 

Published date : 25 Sep 2021 03:55PM

Photo Stories