కర్నూలు సిటీ: ఈ ఏడాది ఆగస్టు 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన డీఈఎల్ఈడీ(డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) థర్డ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల అయినట్లు డీఈఓ డా.వి రంగారెడ్డి అక్టోబర్ 28న ఒక ప్రకటనలో తెలిపారు.
డీఈఎల్ఈడీ సెమిస్టర్ ఫలితాల విడుదల
ఈ పరీక్షలకు మొత్తం 1,607 మంది విద్యార్థులు హాజరుకాగా 1,521 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఫలితాలు www.bse.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చునని సూచించారు.