Skip to main content

EMRS: గుణాత్మక విద్య అందించేందుకే.. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

ఆధునిక యుగంలో విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, ఆ నేపథ్యంలోనే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
EMRS
గుణాత్మక విద్య అందించేందుకే.. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖ ఏజెన్సీలోని అరకులోయ, పెదబయలు, జి.మాడుగుల ప్రాంతాల్లో రూ.59.76 కోట్లతో నిర్మించనున్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని దేశవ్యాప్త సందేశాన్నిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచే విద్యాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నవోదయ విద్యాలయాల తరహాలో పనిచేస్తాయన్నారు. గిరిజన బాల, బాలికలకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించే లక్ష్యంగా ఈ పాఠశాలలను మంజూరు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశాలకు అనుగుణంగా 14 నెలల గడువులోగా నూతన భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. మూడు ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణాలకు సంబంధించి ప్రధాని వర్చువల్‌ విధానంలో చేపట్టిన శిలాఫలకాలను ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్‌ శ్రీకాంత్‌ ప్రభాకర్, జనరల్‌ మేనేజర్‌ అరుంధతి భౌమికలు ఇక్కడ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్, తహసీల్దార్‌ వేణుగోపాల్, ఎంపీడీవో వెంకట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 

ఈ పిల్లలుకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు.. టెక్నాలజీ..

ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌... చివరీ తేదీ

Covid 19: పిల్లల చదువులపై కోవిడ్‌ ప్రభావం ఎంత?

Published date : 16 Nov 2021 11:52AM

Photo Stories