Skip to main content

Pre PhD: పరీక్షా ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2023 ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంఫిల్‌ పార్ట్‌–1, ప్రీ పీహెచ్‌డీ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 24న వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ విడుదల చేశారు.
Pre PhD Exam Results Released
పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్న వీసీ ఆచార్య పి. రాజశేఖర్, పక్కన రీసెర్చ్‌సెల్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్మయి తదితరులు

ఈ సందర్భంగా వీసీ రాజశేఖర్‌ మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించిన కొద్ది రోజులలోనే ఫలితాలు విడుదల చేయడం అభినందనీయమన్నారు. రీసెర్చ్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ పరీక్షలకు హాజరైన పరిశోధకులలో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

చదవండి: ANU: కళాకారుడికి అరుదైన ఆహ్వానం

రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు  చేసుకోవడానికి మే 6 ఆఖరు తేదీగా నిర్ణయించామని, రీవాల్యుయేషన్‌ ఫీజు ఒక్కో స్క్రిప్ట్‌కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య బి.కరుణ, అడ్మిషన్ల డైరెక్టర్‌ డాక్టర్‌ జి.అనిత, ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఇ..శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: Light Pollution: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు.. పరిష్కారం ఏమిటి?

Published date : 25 Apr 2023 04:03PM

Photo Stories