Skip to main content

YSR AFU: వీసీ పోస్టుకు నోటిఫికేషన్

కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) వైస్‌ చాన్సలర్‌ పోస్టుకు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
YSR AFU
వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్

అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు http://apsche.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించింది. 2020లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ఓఎస్‌డీగా ఆచార్య డి.విజయ్‌కిశోర్‌ను నియమించగా.. ఆయన రెండేళ్లకు పైగా ఇన్‌చార్జి వీసీగా, ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 ఫిబ్రవరి 16న ఆయన మాతృసంస్థకు వెళ్లడంతో.. వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావతిని ఇన్‌చార్జి వీసీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాగా, చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో రూ.458 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జూలై 7న భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

చదవండి: 

 

Published date : 08 Jun 2022 01:55PM

Photo Stories