Skip to main content

పారామెడికల్‌ కోర్సుల్లో వెబ్‌ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: బీపీటీ, బీఎస్సీ పారామెడికల్‌ టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్, ఇతర పారామెడికల్‌ కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్‌కు ఆప్షన్‌లను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.
Notification for Web Options Enrollment in Paramedical Courses
పారామెడికల్‌ కోర్సుల్లో వెబ్‌ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్‌

ఈ మేరకు డిసెంబర్‌ 21 నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 21 ఉదయం 9 గంటల నుంచి 26న మధ్యాహ్నం 2 గంటల్లోపు https://ugparamedical.ntruhsadmissions.comలో ఆప్షన్‌లు నమోదు చేసు­కోవాలి. కొత్తగా అడ్మిషన్‌ల కోసం అనుమతు­లు లభించిన కళాశాలల్లోని సీట్లు, రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం చివరి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.

చదవండి: 

89 Jobs: వైద్య పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ

Ministry of Health and Family Welfare: ఎంబీబీఎస్‌ సీట్లు ఇంత శాతం పెరిగాయ్‌

Published date : 21 Dec 2022 03:17PM

Photo Stories