సాక్షి, అమరావతి: బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్, ఇతర పారామెడికల్ కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా చివరి విడత వెబ్కౌన్సెలింగ్కు ఆప్షన్లను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.
ఈ మేరకు డిసెంబర్ 21 నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 21 ఉదయం 9 గంటల నుంచి 26న మధ్యాహ్నం 2 గంటల్లోపు https://ugparamedical.ntruhsadmissions.comలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. కొత్తగా అడ్మిషన్ల కోసం అనుమతులు లభించిన కళాశాలల్లోని సీట్లు, రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.