Skip to main content

Gopal Reddy: 8న ఎంజీయూ స్నాతకోత్సవం

ఎంజీయూ (నల్లగొండ రూరల్‌): న‌వంబ‌ర్ 8న మహాత్మాగాంధీ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ వీసీ గోపాల్‌రెడ్డి న‌వంబ‌ర్ 1న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
MGU graduation ceremony on 8th

ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హాజరవుతారని పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొదటి సారిగా 17 మందికి డాక్టరేట్‌ పట్టాలు అందించనున్నామని తెలిపారు.

ఓయూ మాజీ వీసీ రామచంద్రం పాల్గొననున్న ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఉదయం 9.45 గంటలలోపు హాజరు కావాలని కోరారు.

Published date : 02 Nov 2023 01:21PM

Photo Stories