Skip to main content

AP CM YS Jagan Mohan Reddy : జ‌గ‌న‌న్న విద్యాదీవెన నిధులు విడుద‌ల‌.. అకౌంట్లలో ప‌డిన డబ్బుల వివ‌రాలు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నట్లు చెప్పారు. ఆగ‌స్టు 28వ తేదీ (సోమవారం) నగరిలో బటన్‌ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు.
Funds Released on Aug 28 for Education Initiative, Jagananna vidya deevena 2023 released Telugu news ,Free Higher Studies,100% Fee Reimbursement,
jagananna vidya deevena 2023

ఈ పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు లబ్ధి చేకూరనుంది,

ఈ సంద‌ర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

ap cm ys jagan mohan reddy

చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని సీఎం జ‌గ‌న్‌ అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8,44,336 తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు.

ap students news in telugu

అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్‌ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు.  పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్‌ చేయాలని తెలిపారు.

☛ Jagananna Videshi Vidya Deevena 2023 : పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో చ‌దివేలా..

jagananna vidya deevena 2023 release date

‘నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. మూడో తరగతి నుంచే సబ్జెట్‌ టీచర్‌తో పాఠాలు. ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. రోజుకో మెనూతో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్‌ రూమ్‌లను డిజిటలైజేషన్‌ చేశాం. స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌. డిసెంబర్‌ నాటికి మరో 33 వేల క్లాస్‌రూమ్‌లు డిజిటలైజేషన్ చేయిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.

☛ AP CM YS Jagan Mohan Reddy : విద్యారంగంలో అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ విస్తృత వినియోగించుకోవాలి.. ఈ సర్టిఫికెట్‌ల‌కు ప్రపంచంలో ఎక్కడైనా..

Published date : 28 Aug 2023 02:40PM

Photo Stories