రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఏప్రిల్ 4వ తేదీనుంచి ఒంటిపూట బడులుగా నడవనున్నాయి.
ఒంటిపూట బడులు ప్రారంభ తేదీల సమాచారం
వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ ఏప్రిల్ 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు ఒంటిపూట బడు లు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీనుంచి 13వ తేదీ వరకు టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీనుంచి ఇంటరీ్మడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.