భారతదేశంలోని గొప్ప పరిశోధనా సంస్థలైన ఇస్రో,నేవీ వంటి సమస్త విషయాలపైన బాల్యంలోనే అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని.. మెరుగైన ప్రతిభను కనబరిచారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండులు అభినందించారు. ఈ కార్యక్రమం అత్తాపూర్ భాష్యం పాఠశాల డైరెక్టర్ రామకృష్ణ, ప్రిన్సిపల్ అయూబ్, వైస్ ప్రిన్సిపల్ సౌందర్య పర్యవేక్షణలో జరిగింది.