జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తుల గడువును కేంద్రం అక్టోబర్ 1 వరకు పొడిగించింది.
జాతీయ క్రీడా అవార్డుల్లో భాగంగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రదానం చేయనుంది. అర్హులైన క్రీడాకారులు, కోచ్లు, వివిధ సంస్థలు, వర్సిటీలు స్వయంగా ఛీb్టy్చట–టఞౌట్టట.జౌఠి.జీnలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
చదవండి: Julan Goswami కెరీర్ 5వ ర్యాంక్ తో ముగింపు
నేడు ఆరు క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు
సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా ఎంపిక పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 29న 6 విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాప్ ఎండీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, పవర్ లిఫ్టింగ్ ఎంపికలు జరుగుతాయన్నారు.
Published date : 29 Sep 2022 03:36PM