Deen Dayal Sparsh Yojana: పోస్టల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష
Sakshi Education
సిరికొండ: తపాలశాఖ ఆధ్వర్యంలో సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలలో ‘దీన్దయాళ్ స్పర్శ్ యోజన’ రాష్ట్ర స్థాయి జనరల్ నాలెడ్జ్ పోటీపరీక్షను అక్టోబర్ 1న నిర్వహించారు.
పోస్టల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష
తపాలశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజనర్సాగౌడ్ ముఖ్య అతిధిగా హాజరైమాట్లాడారు. ఫిలాటెలిక్ డిపాజిట్ ఖాతా ఉన్న ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో స్టాంపులసేకరణ అలవాటును పెంపొందించి, వారిలోని ప్రతిభానైపుణ్యాలను మెరుగు పరచ్చడంతోపాటు విజేతలకు రూ.6వేల నగదును అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు.