సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ కలిగిన వైద్యులు, ఇతర మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ తదితర కోర్సులు చదివినట్లయితే.. వాటిని కూడా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి నవంబర్ 24న ఒక ప్రకటనలో కోరింది.
అదనపు వైద్య కోర్సు చదివితే నమోదు
దీనికి సంబంధించి ఒక ఫారాన్ని కూడా విడుదల చేసింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ , డిప్లొమా చదివారో ఆ వివరాలు తెలియజేయాలని కోరింది. పీజీ డిప్లొమాకు రూ.2,100, పీజీ డిగ్రీకి రూ.3,100, సూపర్ స్పెషాలిటీకి రూ.5,100 రుసుము చెల్లించాలని సూచించింది.