విద్యా, వైజ్ఞానిక మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
Sakshi Education
సాక్షి, సిటీబ్యూరో: టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో ఫిబ్రవరి 11, 12 వ తేదీలలో జరిగే టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా, వైజ్ఞానిక మహాసభల పోస్టర్ను హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి జనవరి 30న ఆవిష్కరించారు.
![Hyderabad DEO Rohini unveils TPTF Conference Poster Educational and Scientific Conference Poster Inauguration TPTF State Secondary Education Conference](/sites/default/files/images/2024/01/31/30ppmr0-1706682457.jpg)
విద్యా, వైజ్ఞానిక మహాసభలు ఉపాధ్యాయుల్లో బాధ్యతలు మరింత పెంచే విధంగా చైతన్యం కలిగిస్తాయని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. సభలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: NCC Discipline: ఎన్సీసీ వంటి క్రమశిక్షణే విజయానికి పునాది
టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు కె.సీతారామ శాస్త్రి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, కార్య దర్శులు పి.సోమిరెడ్డి, వి.కామేశ్వరి, రాష్ట్ర కౌన్సిలర్లు ఎ.రమణారావు, ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
Published date : 31 Jan 2024 11:57AM