Skip to main content

పాత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి

రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల వంటి పరికరాల్లేక ఆన్ లైన్‌ విద్యకు దూరమవుతున్నారని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తంచేశారు.
పాత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి
పాత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి

చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద పనిచేసే స్థితిలో ఉన్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని పేద విద్యార్థుల కోసం విరాళంగా అందజేయాలని అక్టోబర్‌ 27న ఆమె ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల సేకరణ కోసం రాజ్‌భవన్ లో సెల్‌ను ఏర్పాటు చేశామని, ఆసక్తి గలవారు అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌ను (మొబైల్‌ నం.9490000242) సంప్రదించాలని సూచించారు. ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు, వ్యక్తులు తమ సంస్థ/వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్‌/మొబైల్‌ నంబర్‌లు, విరాళం ఇవ్వాలనుకుంటున్న ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల సంఖ్య సమాచారంతో rajbhavan-hyd@gov.inకు ఈ– మెయిల్‌ పంపవచ్చని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అవసరం ఉన్న పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో కూడిన సమాచారాన్ని rajbhavan-hyd@gov.inకు మెయిల్‌ ద్వారా అభ్యర్థన పంపాలని సూచించారు. చదువుతున్న తరగతి, కోర్సు, కాలేజీ పేరు, చిరునామా, కాలేజీ ఫోన్‌ లేదా మొబైల్‌ నంబర్, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ను మెయిల్‌ చేయాలని కోరారు.

చదవండి: 

DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం

సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు గవర్నర్‌ సూచన

ICET: ఐసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

Published date : 28 Oct 2021 06:19PM

Photo Stories