Skip to main content

Rayalaseema University: ఆర్‌యూలో ముగ్గురు ప్రొఫెసర్ల తొలగింపు

కర్నూలు (న్యూసిటీ): రాయలసీమ విశ్వవిద్యాలయంలో ముగ్గురు ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగించారు.
Rayalaseema University
ఆర్‌యూలో ముగ్గురు ప్రొఫెసర్ల తొలగింపు

ఈ మేరకు జూలై 17న‌ రిజిస్ట్రార్‌ ఆచార్య బాయినేని శ్రీనివాసులు టెర్మినేషన్‌ (విధుల నుంచి తొలగింపు) ఆర్డర్లను జారీ చేశారు. తొలగించిన ప్రొఫెసర్లలో సుందరానంద పుచ్చ, విశ్వనాథరెడ్డి, భరత్‌కుమార్‌ ఉన్నారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం, పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.

చదవండి: High Court: జేఎన్టీయూ–ఏలో 8 మంది ప్రొఫెసర్ల తొలగింపు

టెర్మినేషన్‌ ఆర్డర్లను మెయిల్‌, స్పీడ్‌ పోస్టు, వాట్సాప్‌, పర్సనల్‌గా ఆ ప్రొఫెసర్లకు పంపించామని ఆయన చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్జెక్ట్‌లను బోధించడానికి గెస్ట్‌ ఫ్యాకల్టీని పిలుపుస్తామన్నారు. ఆ ప్రొఫెసర్లు చూస్తున్న శాఖల బాధ్యతలను వారి స్థానంలో నియమించిన ఆచార్యులకు అప్పగించాల్సి ఉంటుందన్నారు.

Published date : 18 Jul 2023 05:14PM

Photo Stories