విశ్వవిద్యాలయం పరిధిలోని హోమియోపతి (బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), నేచురోపతి–యోగా (బీఎన్ వైసీ), యునాని (బీయూఎంఎస్) డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18న సాయంత్రం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే అఖిల భారత కోటాలో ఆయుష్ కోర్సుల్లో చేరిన, కాళోజీ, ఎనీ్టఆర్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులతో పాటు గత విడతలో సీటు పొంది చేరని అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులని తెలిపారు. మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in సందర్శించాలని సూచించింది.