Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి
Sakshi Education
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తాడేపల్లిలోని కేఎల్ యూనివర్శిటీలో ఇటీవల వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పశ్చిమబెంగాల్కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా శుక్రవారం కర్నూలుకు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇద్దరూ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీలో ఇటీవల జరిగిన అన్ని ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్, మంగళగిరి డీఎస్పీ, కళాశాల విద్య ఆర్జేడీలను సభ్యులుగా నియమించారు.
Published date : 29 Jul 2023 05:13PM