కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో థర్డ్ ఇయర్, ఫోర్తియర్ విద్యార్థుల మధ్య గొడవ జరిగిన సంఘటన అక్టోబర్ 3న వెలుగులోకి వచ్చింది.
JNTUలో విద్యార్థుల మధ్య ఘర్షణ
అక్టోబర్ 3న క్యాంటీన్ వద్ద చోటుచేసుకున్న గొడవ కాస్తా గదుల్లోకి వెళ్లి కొట్టుకునే వరకూ చేరినట్లు తెలుస్తోంది. థర్డ్ ఇయ ర్ విద్యార్థులను ఫైనలియర్ విద్యార్థులు కొట్టగా ఓ విద్యార్థి ముక్కు పగిలినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్టోబర్ 3న కళాశాల ప్రిన్సిపాల్ కామాక్షిప్రసాద్ వద్దకు చేరి మాట్లాడారు.
విద్యార్థులు ఘర్షణ పడిన విషయంపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని ప్రి న్సిపాల్ వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ర్యా గింగ్, స్నేహపూరితంగా మెలిగేతీరుపై విద్యార్థుల్లో అటు కళాశాల యాజమాన్యంగానీ.. ఇటు పోలీసులుగానీ.. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.