Skip to main content

AP NIT: ఏపీ నిట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌కు ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్ గ్రోత్‌ అండ్‌ రీసెర్చ్‌(సీఈజీఆర్‌) సంస్థ 2020–21 ఏడాదికి గాను ఉత్తమ విద్యాసంస్థ అవార్డును ప్రకటించింది.
ఏపీ నిట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
AP NIT: ఏపీ నిట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

నిట్‌లో ప్రామాణిక విద్య, పరిశోధన, సౌకర్యాలను చూసి దక్షిణ భారతదేశంలో ఉత్తమ విద్యాసంస్థగా గుర్తించింది. సెప్టెంబర్‌ 7న జరిగే సీఈజీఆర్‌ 15వ రాష్ట్రీయ శిక్షా గౌరవ పురస్కార వేడుకల్లో అవార్డును అందజేయనున్నారు. పరిశోధకులకు, బోధకులకు, సంస్థలకు సీఈజీఆర్‌ అవార్డులిస్తుంటుంది. దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల ఉపకులపతులు 50 మంది ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు.

Published date : 02 Sep 2021 06:00PM

Photo Stories