Tholimettu: తొలిమెట్టుపై ఉపాధ్యాయులకు అవగాహన
Sakshi Education
జమ్మికుంట: పట్టణంలోని బాలుర ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు నవంబర్ 17న తొలిమెట్టుపై అవగాహన కల్పించారు.
![Professional development for school teachers, Educational workshop for English language teachers, Awareness of teachers on the Tholimettu, First step awareness for English instructors,](/sites/default/files/images/2023/11/20/17hzb102-180133mr0-1700458833.jpg)
జిల్లా పరిశీలకులు వినయధర్రాజు, సరిత, ఎంఈవో విడుపు శ్రీనివాస్లు హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టుపై తెలుసుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రణాళికలను సిద్ధం చేసుకొని రాబోయే రోజుల్లో పరిశీలకులు సందర్శనకు వచ్చినప్పుడు రికార్డులు చూపాలని అన్నారు.
చదవండి: Suvarna Vinayak: విద్యాభివృద్ధిలో తొలిమెట్టు, ఉన్నతి కీలకం
ప్రగతిని విశ్షేషణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్లు ఆకుల సదానందం, మిడిదొడ్డి మిడిదొడ్డి సమ్మయ్య, మండల నోడల్ అధికారి పద్మ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి, ఉమ్మారెడ్డి, వేణుగోపాల్చారి, సంపత్, శ్యామ్కుమార్, సీఆర్పీలు రవి, సురేశ్, రాంబాబు, మహేందర్ పాల్గొన్నారు.
Published date : 20 Nov 2023 11:10AM