యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా (యూఐ) అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రపంచ హరిత వర్సిటీల ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి చెందిన ఏఎన్ యూ రాష్ట్రస్థాయిలో మొదటి, జాతీయ స్థాయిలో 8, అంతర్జాతీయ స్థాయిలో 291వ ర్యాంకును సాధించింది.
యూఐ ర్యాంకింగ్స్లో ఏఎన్ యూకి తొలి స్థానం
ఐక్యరాజ్య సమితి నిర్థారించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. వర్సిటీల్లో ఉన్న మౌలిక వసతులు, శక్తి వనరులు, పర్యావరణ మార్పులు, వ్యర్థాల నిర్వహణ, రవాణా, విద్య అనే 6 కేటగిరీల నుంచి 51 సూచీల ఆధారంగా 10 వేల పాయింట్లకు ర్యాంకులను ప్రకటించింది. దీనిలో ఏఎన్ యూ 6,725 పాయింట్లను సాధించింది. డిసెంబర్ 15న ఏఎన్ యూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి రాజశేఖర్ మాట్లాడుతూ గత పదకొండేళ్లలో ఏపీ నుంచి హరిత విశ్వవిద్యాలయ ర్యాంకును సాధించిన తొలి వర్సిటీగా ఏఎన్ యూ నిలవడం గర్వకారణమన్నారు.