ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం బీఏ, బీకాం, బీఎస్సీ మూడో సంవత్సరం పరీక్షలు జూలై 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సంచాలకులు ఆచార్య కె.విశ్వేశ్వరరావు తెలిపారు.
డిగ్రీ పరీక్షలు తేదీలు విడుదల
జూలై 5వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రూ.500 అపరాధ రుసుంతో జూలై 12వ తేదీ వరకు స్వీకరిస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు సత్వరం ఆన్లైన్లో పరీక్ష రుసుం చెల్లించాలని తెలిపారు. దరఖాస్తులను AU వెబ్సైట్ www.andhrauniversity.edu.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 9963474712, 0891–2844163, 2754966 నంబర్లలో సంప్రదించవచ్చు.