ఆంగ్లం, హిందీతోపాటు తెలుగు మాధ్యమంలో నూ పోటీపరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి లేఖరాశారు.
పోటీ పరీక్షలు తెలుగు మాధ్యమంలోనూ నిర్వహించాలి
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పలు విద్యార్థి సంఘాలు ఎంపీ దృష్టికి తీసుకురావడంతో ఆయన ఈ లేఖ రాశారు. ఎక్కువ మంది విద్యార్థులు ఆంగ్లం, హిందీ మాధ్యమంలో ఉన్న ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ విద్యార్థులు తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారే ఎక్కువమంది ఉన్నారని, అందువల్ల పోటీ పరీక్షలను తెలుగు మాధ్యమంలోనూ నిర్వహించాలని కోరారు.