Skip to main content

AP POLYCET 2023: 30 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

AP POLYCET 2023 final phase counselling

సాక్షి,పాడేరు: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్టు స్థానిక ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.సుజాత మంగళవారం తెలిపారు. ఈనెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ఫీజుల చెల్లింపు, ధ్రువీకరణపత్రాల పరిశీలన,సెప్టెంబర్‌ 2న ఆప్షన్ల ఎంపిక, సెప్టెంబర్‌ 4న సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. సెప్టెంబర్‌ 7వతేదీ లోపు విద్యార్థులు జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలని ఆమె చెప్పారు.అర్హులైన విద్యార్థులు ఈచివరి దశ కౌన్సెలింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

చదవండి: Degree Admissions: డిగ్రీలో ప్రవేశాలకు స్పెషల్‌ డ్రైవ్‌

Published date : 30 Aug 2023 05:56PM

Photo Stories