Skip to main content

EAPCET Rankers: ఈఏపీ సెట్‌లో విద్యార్థుల ప్ర‌తిభ‌.. ఈ ర్యాంకుల్లో నిలిచిన యువ‌కులు!

ఇంజ‌నీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ వంటి కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందేందుకు ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఈఏపీ సెట్ పరీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. అందులో ర్యాంకును సాధించిన త‌మ‌ విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలిపారు తిరుమ‌ల విద్యా సంస్థ‌ల చైర్మ‌న్‌..
Tirumala Educational Institutions students achieves ranks in EAPCET 2024

రాజమహేంద్రవరం: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తమ విద్యార్థులు సత్తాచాటి, అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు శనివారం తెలిపారు. తమ విద్యార్థి ఎన్‌.రాధాకృష్ణ స్టేట్‌ 2వ ర్యాంకు, ఎస్‌.సాకేత్‌రాఘవ్‌ 4వ ర్యాంకు, పి.శివసంపత్‌ నాయుడు 25వ ర్యాంకు, వీఎస్‌జీఎస్‌వీ రామకృష్ణారెడ్డి 53వ ర్యాంకు, వి.అభిశ్యామ్‌ 64వ ర్యాంకు, డి.ప్రభాస్‌ స్టేట్‌ 91వ ర్యాంకులు సాధించారన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను నున్న తిరుమలరావు, తిరుమల విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి అభినందించారు.

International Conference at MBU: ఎంబీయూలో సాంకేతిక పురోగతిపై అంతర్జాతీయ సమావేశం

Published date : 20 May 2024 12:07PM

Photo Stories