Andhra Pradesh: టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
Sakshi Education
దేవరాపల్లి: పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని యలమంచిలి డివిజన్ డిప్యూటీ డీఈవో అప్పారావు ఉపాధ్యాయులకు సూచించారు.
![Special focus on Tenth students](/sites/default/files/images/2024/03/06/educationroundup1mr00-1709722613.jpg)
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఉషోదయ హైస్కూల్ను జనవరి 3న ఆయన ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలల్లో రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, బోధనపై ఆరా తీశారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎంఈవోలు బి.పడాల్దాస్, వి.ఉషారాణి, ఉషోదయ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రాధ, ఉపాధ్యాయుడు వెంకటరమణ పాల్గొన్నారు.
Published date : 05 Jan 2024 10:51AM