రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను టీచర్లతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపిన సంస్థలు తమ ఆప్షన్ ను ఉపసంహరించుకుంటే.. వారి ఎయిడెడ్ సిబ్బందిని వెనక్కు తీసుకోవడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆర్జేడీలు, డీఈవోలకు సూచించారు.
టీచర్లను వెనక్కు తీసుకునేందుకు అనుమతి
ఈమేరకు నవంబర్ 16న మెమో జారీచేశారు. జీవో నంబర్ 50కి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆప్షన్ ఉపసంహరణకు అవకాశం కల్పించినందున ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.