సాక్షి, అమరావతి: జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1.5–2012 నుంచి 30–07–2014 మధ్య జన్మించి, ఆయా జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. జవహర్ నవోదయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో 15, తెలంగాణలో 9 పాఠశాలలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలోకి విద్యార్థులను ఎంపిక చేస్తారు. విద్యార్థులు ఆగస్టు 10వ తేదీ లోగా https://cbseitms.rcil.gov.in/nvsలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.