వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వాయిదా పడ్డ స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెడ్మాస్టర్ల పదోన్నతుల ప్రక్రియను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అనుమతించింది.
టీచర్ల పదోన్నతులకు లైన్ క్లియర్
కోడ్ ముగియడంతో ఈ ప్రక్రియను చేపట్టాలని ఆర్జేడీలు, డీఈవోలకు నవంబర్ 29న మెమో జారీచేసింది. అందులో షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 11న గ్రేడ్–2 హెడ్మాస్టర్ల పదోన్నతులకు, డిసెంబర్ 13, 14 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ పదోన్నతులకు కౌన్సెలింగ్ను చేపట్టాలని జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) మువ్వా రామలింగం మెమో జారీచేశారు.