Skip to main content

Education Minister: టెన్త్ పరీక్షలు యథాతథం

టెన్త్ పబ్లిక్‌ పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నారు. వీటి తేదీల్లో ఎలాంటి మార్పులేదని మంత్రి వివరించారు.
adimulapu suresh
మంత్రి ఆదిమూలపు సురేష్

ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం నెలరోజుల్లో పూర్తిచేయించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అలాగే, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌ను జూన్ లేదా జూలైలో నిర్వహిస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు.

చదవండి: స్డడీ మెటీరియల్‌ | బిట్ బ్యాంక్ | సిలబస్ | మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఇక కొత్తగా ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల అనుమతులకు సంబంధించి ఇప్పటికే సర్వే చేయించామని, అవసరమైన మేరకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. స్కూళ్ల మ్యాపింగ్‌కు సంబంధించి మూడు కిలోమీటర్ల పైబడి ఉన్న వాటి విషయంలో అభ్యర్థనలు వస్తున్నందున పరిశీలిస్తామన్నారు. ఉర్దూ సహా ఇతర మైనర్‌ మీడియం పాఠశాలలు యథాతథంగానే కొనసాగుతాయని, వాటికి మ్యాపింగ్‌ ఉండబోదన్నారు.

Published date : 04 Mar 2022 03:42PM

Photo Stories